ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుడిహత్తూర్ మండలానికి చెందిన ఆదివాసీలు ఆదివారం రాత్రి.. నార్నూర్ మండలంలోని జంగుబాయి దైవ దర్శనానికి వెళ్తుండగా డీసీఎం అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో 47 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటీన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa