ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ : సీఎం రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 27, 2025, 03:57 PM

మధ్యప్రదేశ్లోని ఇండోర్‌లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "జై బాపు, జై భీమ్, జై సంవిధాన్" ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీతో కలిసి మనం ఈ పోరాటం చేస్తున్నామని అన్నారు. ఇది ఎన్నికల ర్యాలీ కాదు… ఇది ఒక యుద్ధం అని పేర్కొన్నారు. ఈ యుద్ధం రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడేవారికి, రాజ్యాంగాన్ని మార్చాలనుకునేవారికి మధ్య జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతున్నారని తెలిపారు.గజనీ మహమ్మద్ హిందుస్తాన్‌ను దోచుకోవడానికి ప్రయత్నించినట్లు… రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కానీ ఆయన ప్రయత్నం ఫలించడం లేదు.. ఎందుకంటే ఆనాడు బ్రిటిషర్ల నుంచి మహాత్మా గాంధీ దేశాన్ని రక్షించినట్లు భారతీయ జనతాపార్టీ పేరుతో చలామని అవుతున్నా బ్రిటిష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీ నిలబడ్డారని అన్నారు. ఈ యుద్ధంలో మనమంతా రాహుల్ గాంధీతో కలసి నడవాలని రేవంత్ రెడ్డి తెలిపారుజరాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు మనమంతా కలిసికట్టుగా పోరాడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇది రెండు పరివార్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం అని అన్నారు. ఒకటి గాంధీ పరివార్… మరొకటి గాడ్సే పరివార్ అని తెలిపారు. గాడ్సే పరివార్ వైపు నుంచి మోదీ… గాంధీ పరివార్ వైపు నుంచి రాహుల్ గాంధీ పోరాడుతున్నారని పేర్కొన్నారు. అందుకే మనమంతా గాంధీ పరివార్‌గా రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలని తెలిపారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com