ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెరువులు కలుషితం కాకుండా చర్యలు చేపట్టండి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 04:05 PM

చెరువుల రక్షణకై ప్రతి ఒక్కరూ పాటుపడాలని, చెరువుల్లో మురుగునీరు కలవకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. అనంతరం 132 డివిజన్ అంగడిపేటలోని అల్లం చెరువును కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ పథకంలో భాగంగా సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో సుందరీకరించిన అల్లం చెరువును సమీప కాలనీ వాసులకు ఆహ్లాద వాతావరణాన్ని అందించేందుకు సుందరీకరించామని, ఈ అల్లం చెరువులో మురుగు నీరు కలవకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి మారయ్య, నాయకులు అనిల్, పులి మహేష్, కృష్ణ ముదిరాజ్, జి.హెచ్.ఎం.సి. ఈఈ లక్ష్మీ గణేష్, డిఈ పాపమ్మ, ఏఈ అనురాగ్, వాటర్ వర్క్స్ డీజిఎం రాజేష్, మేనేజర్ అనుషా తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa