సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా బాధితులకు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 60,000/- మరియు రూ 46,000 , ల సీఎం సహాయనిధి నుండి (CMRF) ని మంజూరి చేయించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి.127 డివిజన్ ఇందిర గాంధీ నగర్, బాచుపల్లి సాయి నగర్ చెందిన వాసులు జన శిరోమణి 60,000రూ, ఉమ కి 47,500 రూ CMRF-మంజూరి పత్రాలను (చెక్కులు) అందజేశారు మరియు 127 డివిజన్ ఇందిర గాంధీ నగర్ మమత గారికి రూ. 1,00116/- ల కల్యాణ లక్ష్మి చెక్కును అందజేశారు.
అనంతరం హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా పేద కుటుంబాలకు ఎంతో మేలు చేకూరుతుందని అనారోగ్యం బారిన పడిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పెరికె శివ, తైలం శ్రీనివాస్, NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, కొలన్ జీవన్ రెడ్డి, శామీర్ పెట్ ప్రకాష్ రావు, ప్రశాంత్ రెడ్డి, గొంగుల నవీన్, అది రెడ్డి, లక్ష్మి రెడ్డి, మాధవి రాణి, నీల గుప్తా, చిన్నమ్మ, జానకి, ధనలక్ష్మి, కోమల, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa