ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఫిబ్రవరి 07 2025న తలపెట్టిన ఎస్సీ ఏ బి సి డి వర్గీకరణ అమలు కై హైదరాబాదులో లక్ష డప్పులు వేల గొంతుకల మహా ప్రదర్శన భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని దేవరకొండ స్థానిక ఐబీ గెస్ట్ హౌస్ నందు మంగళవారం నియోజకవర్గంలోని ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు మాదిగ మాదిగ ఉపకులాల ప్రజలు వేలాదిగా గ్రామాల నుంచి తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు 30 సంవత్సరాల ఎమ్మార్పీఎస్ సుదీర్ఘ పోరాటంలో 2000 సంవత్సరంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అమలై 2004 వరకు మాదిగ మాదిగ ఉప కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందినాయి తదనంతరం సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం లేదని చెప్పడంతో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఆగిపోవడం జరిగింది.
2025 ఆగస్టు 1న ఏడుగురు జడ్జీల సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ న్యాయమైనదని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని అనుకూలంగా తీర్పు ఇవ్వడంతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దేవరకొండ నియోజకవర్గం లోని మాదిగ మాదిగ ఉపకులాలు వేలాదిగా తరలి వెళ్లాలని వారు పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు డివిజన్ నాయకులు మండల నాయకులు గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa