ఉపాధి హామీ పనికి వెళ్లి తల్లీ, కూతరు దుర్మరణం పాలైన విషాదం ఘటన సిద్దిపేట జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..అక్కన్నపేట మండలంలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన కందారపు సరోజన (45) అన్నాజీ మమత (28) రోజు మాదిరిగానే మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకంలో భాగంగా కూలీ పనికి వెళ్లారు. మట్టిని తవ్వుతున్న క్రమంలోనే పైన ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లు సరోజన, మమత మీద పడిపోయాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఉపాధి కూలీ రేణుక, స్వరూపలకు కాలు విరిగింది. విషయంల తెలుసుకున్న గ్రామస్థులు చనిపోయిన సరోజన, మమతలను బండరాళ్ల మధ్య నుంచి అతి కష్టం మీద బయటికు తీశారు. అలాగే తీవ్రంగా గాయపడి కాలు విరిగిన రేణుక, స్వరూపలను 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం హుటాహుటిన హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa