హైదరాబాద్ పాతబస్తీలోని మాదన్నపేట ప్రాంతంలోని ఓ శ్మశానంలో వింత శబ్ధాలు రావడంతో చాలాకాలంగా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వందల సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పురాతన శ్మశానవాటిక ఉంది.అయితే శ్మశానం దగ్గరే ఉండే షాపు నిర్వహకుడు ఏకంగా తన షాపుతో పాటు పక్కనే ఉన్న సమాధులను తగులబెట్టేశాడు. తన కట్టల షాపుల్లో ప్రమాదవశాత్తుగా మంటలు వచ్చాయని అందరినీ నమ్మించాడు. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా ఇప్పించుకున్నాడు. ముస్లిం శ్మశానంలో ఒక పక్క మంటలు.. మరో పక్క తవ్వకాలు జరగడంతో అనుమానం వచ్చిన కొందరు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై స్పందించిన ఒవైసీ సంబంధిత అధికారులను సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించాలంటూ పంపించారు. వందలాది సంవత్సరాల శ్మశానం కావడంతో వక్ఫ్ బోర్డు చైర్మన్తో సహా అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. అంతేకాకుండా షాపు నిర్వహకుడు తన షాపుతో పాటు మిగతా సమాధులను దెయ్యాలే తగులబెట్టాయంటూ అధికారులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అధికారులు మాత్రం శ్మశాన స్థలాన్ని ఆక్రమించడానికి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని భావిస్తున్నారు. కావాలనే ఇదంతా చేసి నెపాన్ని దెయ్యాలపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడా అనే కోణంలో పోలీసులు, వక్ఫ్బోర్డ్ అధికారులు విచారణ చేపట్టారు. ఘటనపై స్పందించిన వక్ఫ్బోర్డ్ చైర్మన్ మాత్రం శ్మశానాల్లో షాపు ఏర్పాటు చేసుకోవడం ఏంటని, శ్మశానం అన్నాక దెయ్యాలు ఉండక మనుషులు ఉంటారా.. మీరెందుకు వెళ్లారంటూ ప్రశ్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa