ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోపణలు చేస్తే సహించేది లేదు...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2025, 02:08 PM

నిత్యం అభివృద్ధి కోసం పరితప్పించే మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని,మండల అధ్యక్షుడు ముస్క్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికై కృషి చేస్తున్నామని
ఖానాపురం గ్రామ మాజీ సర్పంచ్ గాదె వెంకన్న పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు తీసుకుంటున్నారంటూ బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన ఆరోపణలు నిజంగా అర్థరహితమైనవని, ఆయన రాజకీయ చరిత్రలో అవినీతి మరక అంటని నేత ఉత్తంకుమార్ రెడ్డి అని కొనియాడారు.
నిజాయితీ కలిగిన వ్యక్తి కాబట్టే ఈరోజు రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. మీలాగా నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించలేదని, మరోసారి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రయాణం కొనసాగిస్తున్నారని, వారి సారధ్యంలో కోదాడ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందబోతుందన్నారు. అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముసుకు శ్రీనివాస్ రెడ్డి సారధ్యంలో ఖానాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa