కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పెద్ద పీఠం వేస్తుందని అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు శ్రీనివాసరెడ్డి అన్నారు. కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు అమీనాబాద్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల సీసీ రహదారి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారుల అభివృద్ధికి ఎన్ ఆర్ జి ఎస్ నిధుల నుండి 5 లక్షల రూపాయలు పాఠశాల రహదారికి మంజూరయ్యాయని తెలిపారు. ఇతర పార్టీలకు చెందిన నేతలు విమర్శలు మానుకొని అనంతగిరి మండల అభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. గ్రామాల సంక్షేమ పథకాల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని చెప్పారు. గత పదేళ్లలో బారాస ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు గృహ నిర్మాణాలు కొత్త మండలానికి రహదారులు ప్రభుత్వ కార్యాలయాల భవనాలు ఇవ్వలేకపోయిందని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పద్మావతి రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బారాస నాయకుల తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు. అనంతగిరి మండలం వడి వడిగా ప్రగతి పదంలో నడుస్తోందని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పద్మావతి రెడ్డి సారధ్యంలో మండలం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుర్ర పుల్లారెడ్డి, మాజీ ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు, గ్రామ శాఖ అధ్యక్షులు సాదే కోటేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బానోతు బాబు నాయక్, మాజీ వార్డ్ నెంబర్ వెంకట్రామ నరసయ్య, గ్రామ పెద్దలు కీతా లక్ష్మీనారాయణ, మేకల శీను, చిత్తలూరి వీరబాబు, కానుకుర్తి వెంకటేశ్వ,ర్లు సాదే సైదయ్య మీసాల నాగరాజు, బ్రహ్మం ఇరుగు సత్యనారాయణ, బెక్కం చందర్రావు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa