భర్తకు తెలియకుండా ఓ వ్యక్తికి అప్పు ఇచ్చింది. ఆపదలో ఉన్నానంటే పెద్ద మనసుతో డబ్బులు ఇచ్చింది. అయితే అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఈ విషయం భర్తకు తెలిసి ఇంట్లో గొడవలు మెుదలయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన మహిళ.. కఠిన నిర్ణయం తీసుకుంది. ఇక బతకటం కష్టమని ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చందు, లావణ్య దంపతులు టీఎస్ఐఐసీ కాలనీలో ఉంటున్నారు. చందు ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తుండగా.. లావణ్య టైలర్గా పని చేస్తోంది. అయికే వీపిరి తొమ్మిది నెలల క్రితం శివరామ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతడికి రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చారు. ఆ తర్వాత మరోసారి మరోసారి డబ్బులు కావాలని శివరామ్ లావణ్యను కోరాడు. వడ్డీకి ఆశపడ్డ లావణ్య ఈ సారి భర్తకు తెలియకుండా బంగారు నగలు తాకట్టుపెట్టి రూ.3 లక్షలు అప్పుగా ఇచ్చింది. అయితే తీసుకున్న అప్పు అతడి తిరిగి ఇవ్వలేదు.
ఆ తర్వాత విషయం భర్త చందుకు తెలిసింది. గతంలో ఇచ్చిన రెండు లక్షలే ఇంకా ఇవ్వలేదని.. మళ్లీ డబ్బులు ఎందుకు ఇచ్చావని చందు లావణ్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. డబ్బు ఇవ్వాలని శివరామ్ గట్టిగా అడగ్గా.. అతడు దాటవేస్తూ వస్తున్నాడు. గత నెల 30న డబ్బుల విషయంలో భార్యభర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. దీంతో శివరామ్కి లావణ్య ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని కోరింది. నీ వల్లే తన భర్తతో గొడవలు జరుగుతున్నాయని చెప్పింది. అనంతరం జనవరి 31న ఇంట్లోని తన గదికి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకుంది. కొద్ది నిమిషాల్లోనే ఇంటికి వచ్చిన భర్త ఫ్యాన్కు వేలాడుతున్న ఆమెను చూసి షాకయ్యాడు. ఆమెను వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఆమె మృతి చెందింది. తన భార్య లావణ్య చావుకు శివారమే కారణమని చందు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa