ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో ఉద్రిక్తత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 05, 2025, 12:34 PM

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో ఉద్రిక్తత నెలకొంది. మండలంలోని ప్యారానగర్‌ సమీపంలో జీహెచ్‌ఎంసీ డంపింగ్‌ యార్డ్‌ (GHMC Dumping Yard) ఏర్పాటును వ్యతిరేకిస్తూ అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళన చేస్తున్న 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్యారానగర్‌లో 100 ఎకరాల్లో డంపింగ్‌ యార్డ్‌ను ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. కాగా, స్థానికుల వ్యతిరేకతతో జీహెచ్‌ఎంసీ అధికారులు అర్ధరాత్రి వేళ రహస్యంగా డంపింగ్‌ యార్డ్‌ నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని నిర్మాణ పనులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa