గ్రామానికి చెందిన ఆడబిడ్డలకు మేనమామలా అండగా ఉంటానని తిమ్మాపూర్ మాజీ వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి భరోసానిచ్చారు. రేణికుంట గ్రామస్థుల కోసం తాను తీసుకొచ్చిన 'మా ఊరు.. మహాలక్ష్మి' పథకంలో భాగంగా గ్రామానికి చెందిన 16 మంది ఆడపిల్లల తల్లులకు ఒక్కొక్కరికి రూ.5016 విలువైన ఫిక్స్ డిపాజిట్ చెక్కులను తన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏటా తన కూతురి పుట్టినరోజును పురస్కరించుకొని గ్రామానికి చెందిన ఆడపిల్లలకు ఈ పథకం కింద ఫిక్స్ డిపాజిట్ చేయడం జరుగుతుందన్నారు.
గ్రామస్తుల ఆశీస్సులతో ఈ పథకం నిర్విరామంగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎలుక ఆంజనేయులు, ల్యాగల దేవేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బొమ్మగాని నారాయణ, బొంగాని రమేశ్, బుర్ర అంజయ్య, కనపర్తి బస్వరాజు, చంద్రశేఖర్, చెవుల తిరుపతి, శంకర్, బావండ్ల లక్ష్మణ్, బోయిని సతీష్, గోనెల రాజు, స్వామి, పోతుగంటి రమేష్, బొంగాని పరశురాం, గడ్డం తిరుపతి, గొల్లపల్లి మల్లేశం, తమ్మనవేని శ్రీనివాస్, దేశిని ఐలయ్య, పృధ్వీ, జెల్ల సాయి, కొర్రి వంశీ, భీరం మహేశ్వరి, స్వప్న, అంజలి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa