విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ (69 నాటౌట్) అద్భుత అర్ధ సెంచరీతో చెలరేగడంతో, టీమిండియా 8 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలుపొందింది. ఇంకా ఐదు ఓవర్లకు పైగా మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి, ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యం సంపాదించింది.అంతకుముందు, టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక బ్యాటర్లలో విష్మి గుణరత్నే (39) టాప్ స్కోరర్గా నిలిచింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో శ్రీలంక పెద్ద స్కోరు చేయలేకపోయింది. దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి తలో వికెట్ పడగొట్టారు.122 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన (25), షఫాలీ వర్మ (9) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే, వారిద్దరూ ఔటైన తర్వాత, జెమీమా రోడ్రిగ్స్ ఇన్నింగ్స్ను ముందుండి నడిపించింది. కేవలం 44 బంతుల్లో 10 ఫోర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెకు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (15 నాటౌట్) చక్కటి సహకారం అందించడంతో, భారత్ 14.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన జెమీమాకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబరు 23న ఇదే స్టేడియంలో జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa