ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నామినేటెడ్ పదవులు పొందిన జనసేన నాయకులతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 22, 2025, 01:25 PM

కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన దాదాపు 3 వేల మందితో సమావేశం నిర్వహించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ విషయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.నామినేటెడ్ పదవులు పొందిన వారితో పార్టీ అధినేత సోమవారం సమావేశం కానున్నారని ఆయన పేర్కొన్నారు. "పదవి - బాధ్యత" పేరుతో నిర్వహించే ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగే ఈ కార్యక్రమం గురించి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులతో నాదెండ్ల మనోహర్ నిన్న టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, కార్యక్రమ వివరాలను వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీ తరపున నిర్వహిస్తున్న "పదవి - బాధ్యత" కార్యక్రమం అత్యంత కీలకమైన సమావేశమని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa