ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతించిన మంద కృష్ణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 09:27 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. మిమ్మల్ని కలవడానికి సమయాన్ని కేటాయించాలని ఆయన ఆ లేఖలో కోరారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని మంద కృష్ణ స్వాగతించారు.జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికలో లోపాలు ఉన్నాయని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఆ లోపాల వల్ల కొన్ని కులాల హక్కులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నివేదికపై చర్చించి సూచనలు చేసేందుకు తాము ముఖ్యమంత్రిని కలవాలని అనుకుంటున్నట్లు మంద కృష్ణ వెల్లడించారు. వీలైనంత త్వరగా తమకు సమయం కేటాయించాలని కోరారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa