తెలంగాణ ప్రభుత్వం మంగళవారం కీలక హెచ్చరికలు జారీచేసింది. రాష్ట్రంలోని ప్రజలు కొన్ని రోజులు చికెన్ తినవద్దని హెచ్చరించింది. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు వ్యాపించినందున.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, భీమడోలు, కొల్లేరు కాకినాడ, ఏలూరులో కోళ్లు చనిపోవడంతో.. కోళ్ల రక్త నమూనాలు తీసి భోపాల్లోని ల్యాబ్కు పంపారు పశుసంవర్ధకశాఖ అధికారులు. 15 రోజులుగా వణికిస్తున్న వైరస్ ఏవియన్ ఇన్ఫ్లూయెంజా H5N1 అని భోపాల్లోని యానిమల్ డిసీజెస్ ల్యాబ్ తేల్చింది. తణుకు మండలం వేల్పూరు, పెరవలి మండలం కానూరు గ్రామాల్లో చనిపోయిన కోళ్లకు హెచ్5ఎన్1 పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో… చికెన్ తినొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఏపీలో చికెన్ తినే వారి సంఖ్య తగ్గింది. దీంతో రేట్లు కూడా తగ్గిపోయాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa