తెలంగాణ సర్కారుపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. DSC-2008 అభ్యర్థులకు నియామక పత్రాల జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 3న ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. అభ్యర్థులు ఏండ్ల తరబడి నిరీక్షిస్తున్నా, కోర్టు నియామకాలు చేపట్టాలని ఆదేశించినప్పటికీ అధికారులలో కదలిక లేకపోవడం శోచనీయమని తెలిపింది. ఈ నెల 17లోపు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా ఎందుకు అమలు చేయలేదని అడిగింది. కోర్టు ధిక్కరణగా పరిగణించి ఉత్తర్వులు జారీ చేయాల్సివస్తుందని, ఇలా చేస్తే మీ కెరీర్పై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఈ వ్యవహారంపై జస్టిస్ అభినంద్కుమార్ షావిలి, జస్టిస్ ఇ.తిరుమలాదేవితో కూడిన బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. డీఎస్సీ 2008కి సంబంధించి 1,382 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్నామన్నారు.కొంత గడువు కావాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదనపై అసంతృప్తి వ్యక్తం చేసిన బెంచ్ ఉత్తర్వులు అమలుచేయకపోతే కార్యదర్శి, కమిషనర్ హాజరుకావాల్సి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసినా అమలు చేయరా? అని నిలదీసింది. అధికారులు ఎందుకు హాజరుకాలేదని, నాన్బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తామని హెచ్చరించింది. దీంతో మధ్యాహ్నం దాకా గడువు ఇవ్వాలని న్యాయవాది అభ్యర్థించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa