ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుంభమేళాలో విషాదం.. నాచారం వాస్తవ్యులు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2025, 12:40 PM

కుంభమేళా విషాదం చోటచేసుకుంది. మినీ బస్సులో 14 మంది ప్రయాణిస్తున్నారు నాచారం కు చెందిన కార్తికేయ నగర్ వాసులు. కుంభమేళ ప్రయాగరాజు నుండి తిరుగు ప్రయాణం అవుతుండగా సంఘటన. మధ్యప్రదేశ్ జబల్పూర్ శిరోహి ప్రాంతంలో ఉదయం 9 గంటల పది పది నిమిషాలకు జరిగిన సంఘటన. అందులో ఏడుగురు మృతి చెందారని వార్త మరో ఆరుగురికి గాయాలైనట్టు సమాచారం.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ లోని నాచారానికి చెందిన కొందరు భక్తులు ఓ ప్రైవేట్ వాహనంలో కుంభమేళాకు వెళ్లారు. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి పూజలు చేసిన అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం NH-30పై  మోహ్లా-బార్గి వంతెన సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట్టడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఏడుగురు ఏపీ వాసులు చనిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీపంలో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జబల్‌పూర్ కలెక్టర్, జిల్లా ఎస్పీ సహా ఉన్నతాధికారులు ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి పరిశీలించారు. ఈ రోడ్డు ప్రమాదం కారణంగా జబల్పూర్ లోని సిహోరా బైపాస్ వద్ద 10 నుంచి 15 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ అయింది. వేల వాహనాలు రోడ్డు మీద నిలిచిపోయి ప్రజలు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa