ఆస్తి కోసం భర్తతో కలిసి అక్క తమ్ముడిని హత్యకు పాల్పడిన ఘటన సిద్ధిపేటలో వెలుగు చూసింది. ఆకునూరుకి చెందిన దొండకాయల కనకయ్యకు ఇద్దరు తమ్ముళ్లు, ఒక అక్క ఉన్నారు. తల్లిని సరిగా చూడడం లేదని కనకయ్య అక్క యాదవ్వ తల్లి బాగోగులు చూసుకుంటూ తల్లి పేరున ఉన్న 3 ఎకరాల భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకుంది. భూమిని తిరిగి ఇవ్వమని తమ్ముళ్లు అడగటంతో గొడవలు జరిగాయి. దీంతో కనకయ్యపై కక్ష పెంచుకుని హత్య చేశారు.ఈ నెల 6వ తేదీన భూమి విషయం మాట్లాడేందుకు యాదవ్వ కూతురు పిండి కవిత గ్రామం అయిన మర్పడగకు కనకయ్య వెళ్లాడు. విషయం మాట్లాడుతున్న సమయంలో కవిత తన తండ్రి లింగం, తమ్ముడు కృష్ణమూర్తికి ఫోన్ లో తెలిపడంతో అబ్బు యాదవ్వతో కలిసి కూతురు ఇంటికి వెళ్లారు. మాటల్లో పెట్టి ఆ నలుగురు దొండకాయల కనకయ్యను దోమలోనిపల్లి లో గల వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లారు. మాట్లాడుతున్న సమయంలో యాదవ్వ కొడుకు కృష్ణమూర్తి కోపంతో కనకయ్యను కట్టెతో తల వెనుక భాగంలో కొట్టగా స్పృహ తప్పి పడిపోయాడు. అదే అదునుగా భావించి తాడుతో ఊపిరాడకుండా చేసి చంపి అనుమానం రాకుండా అక్కడే ఉన్న మామిడి చెట్టుకు వేలాడదీశారు. అర్ధరాత్రి శవంను దించిన అబ్బు లింగం, కొడుకు కృష్ణమూర్తి, అల్లుడు పిండి ఎల్లాలు, బిడ్డ కొడుకు సాయిరాజులతో కలిసి ఎర్టిగా కారులో తీసుకొని వెళ్ళి మృతుడు రోజు ప్రయాణించే దారి సేలంపు శివారులో దర్గా వెళ్ళే రోడ్డు పక్కన బండిపై నుంచి పడినట్లు గా చేసి రోడ్డు ప్రమాదం గా చిత్రీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa