సర్వేనెంబర్ 233/21, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ పరిధిలో శ్రీ సాయినాథ్ కాలనీ శివాలయం పక్కనే ప్రభుత్వ భూమి 1,100 గజాల ప్రభుత్వ స్థలాన్ని నిన్న ఆక్రమించుకొని అక్రమ నిర్మాణం చేసుకుంటున్న నేపథ్యంలో ఎమ్మార్వో కు ఫిర్యాదు చేసినా సరైన విధంగా స్పందించకపోవడంపై ఫిర్యాదు చేయడంమే కాకుండా, ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణం కూల్చివేసి కబ్జాదారుడు పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పార్టీలకతీతంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీల గోపాల్ రెడ్డి మరియు బీజేపీ మాజీ అధ్యక్షులు ఆకుల సతీష్ ఆధ్వర్యంలో కాలనీ ప్రజలు, వివిధ పార్టీల సీనియర్ నాయకులు కలిసి కలెక్టర్ గారికి, మరియు అడిషనల్ కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది..అదే విధంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ డంపింగ్ యార్డ్ మరియు ప్రగతి నగర్ డంపింగ్ యార్డ్ స్థలాలు,మరియు కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ స్థలాలను కబ్జాలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలకు అతీతంగా మాజీ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారి ఆద్వర్యంలో ప్రజాప్రతినిధులు,నాయకులతో కలసి గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.అదే విధంగా ప్రజాప్రతినిధులు,నాయకులు కార్పొరేషన్ పరిధిలో భూ కబ్జాలకు గురి కాకుండా పార్టీలకతీతంగా ఆయా పార్టీల నాయకులు కలిసి ముందుకు రావాలని మాజీ మేయర్ గారు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa