రంగారెడ్డి జిల్లా తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి హరీష పై దాడి చేసిన నిందితుడు కరణ్ సింగ్ ను కఠినంగా శిక్షించాలని మెట్ పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి డిమాండ్ చేశారు. దాడికి నిరసనగా మెట్ పల్లి కోర్టులో శుక్రవారం విధులను బహిష్కరించి న్యాయవాదులు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల న్యాయమూర్తులకు, న్యాయవాదులకు భద్రత లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాయత్నం కేసులో నిందితుడైన కరణ్ సింగ్ కు న్యాయమూర్తి యావజీవ కారాగార శిక్ష విధించడం జరిగిందన్నారు. మరో హత్య కేసులో నిందితుడిని పోలీసులు న్యాయస్థానానికి తీసుకురాగా నిండితుడు కరణ్ సింగ్ ఆగ్రహంతో న్యాయమూర్తి హరీష ఫై చెప్పు విసిరాడం తో పాటు న్యాయమూర్తిని,
న్యాయవాదులను దుర్భాషలాడాడని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థను అవమానించిన కరణ్ సింగ్ ను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం న్యాయమూర్తులకు, న్యాయవాదులకు పటిష్టమైన భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాంబాబు, కార్యదర్శి వేణుగోపాల్, న్యాయవాదులు శ్రీనివాస్, వెంకటస్వామి, రాజ్ మహమ్మద్, యుద్ధ వీర్, సత్యనారాయణ, భానుమూర్తి, మధుసూదన్ రెడ్డి, శేఖర్, జగన్, సుధాకర్, స్రవంతి, మానస, కావేరి, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa