చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని రెవెన్యూ సర్వే నెంబర్ 75లో గల ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న నిరుపేదల ఇళ్ల స్థలాలకు పట్టాలివ్వాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే రామస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇండ్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకుని ఇండ్ల పట్టాల కోసం భూపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. నిరుపేదలు గుడిసెలు వేసుకొని నేటికి రెండు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి అధ్యక్షతన రెండవ వార్షికోత్సవము ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే రామస్వామి హాజరై మాట్లాడారు. గత రెండు సంవత్సరాలుగా భూ పోరాట కేంద్రంలో ఎలాంటి మౌలిక వసతులు లేకున్నా మొక్కవోని దీక్షతో ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని భూపోరాటం చేస్తున్న గుడిసె వాసులను అభినందించారు.
ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలకు పట్టాలు మంజూరు చేసి పలు మోళిక సదూపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుడిసె వాసులకు పట్టాలు ఇచ్చే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ వారికి అండగా పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యం ప్రభులింగం, కౌన్సిల్ సభ్యుడు సుధాకర్ గౌడ్, బీకేయంయు జిల్లా అధ్యక్షుడు జే అంజయ్య, మొయినాబాద్ మండల కార్యదర్శి కే శ్రీనివాస్, షాబాద్ మండల కార్యదర్శి జంగయ్య, గండిపేట మండల పార్టీ సహాయ కార్యదర్శి ఎండీ మక్బుల్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు శివ, నాయకులు బాబురావు, పెంటయ్య, శ్రీకాంత్, యాదగిరి, లలితమ్మ, సుగుణమ్మ, రమాదేవి, గుడిసె వాసులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa