కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండలంలోని బియ్యం స్మగ్లర్ల మధ్య జరిగిన సంభాషణ ఆడియో వైరల్గా మారింది.ఈ ఆడియోలో,అధికారులకు డబ్బులు ఇచ్చినట్లు వారు చర్చించుకున్నారు. అయితే,ఈ ఆరోపణల్లో నిజంలేదని, ఒకవేళ డబ్బులు తీసుకున్నట్లయితే అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం జరగకపోతుండేదని ప్రజలు వ్యాఖ్యా నిస్తు న్నారు.గతంలో కొన్ని అధికారుల ప్రమేయం ఉండి ఉండవచ్చునని ఊహాగానాలు ఉన్నప్పటి కీ,ప్రస్తుత అధికారులు కఠినంగా వ్యవహరిస్తుండ డంతో స్మగ్లర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.
దీంతో, వీరు అధికారులపై తప్పుడు ప్రచారం చేసి వారిని మార్పిడి చేయించేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. తప్పుడు ఆరోపణలపై కఠినచర్యలు కౌటాల సీఐ ముత్యం రమేష్ స్పంది స్తూ, "ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంది. కానీ, ఈ హక్కును దుర్వినియోగం చేసి అధికారుల ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు ఆరోపణలు చేయడం చట్టరిత్యా నేరం. పోలీస్ శాఖను అప్రతిష్టపాలుచేసే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.అలాగే అక్రమ రవాణాపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, అత్యవసర సమయంలో 100కు కాల్ చేయాలని సూచించారు.ఈ ఘటన రేషన్ అక్రమ రవాణా దందాలకు ఎదురులేని సవాలుగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa