ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థుల విద్య, వసతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: అడిషనల్ కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 16, 2025, 11:57 AM

విద్యార్థుల విద్య వసతుల పట్ల నిర్లక్ష్యం సహించేది లేదని హనుమకొండ జిల్లా కలెక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఆత్మకూరు మండలం పెద్దాపూర్ లోని  మహాత్మా జ్యోతిబా పూలే  గురుకుల పాఠశాల ( బాలికలు) గురుకులాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లో కిచెన్ పరిసరాలను, విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థినులతో ముఖాముఖి సంభాషించారు. రానున్న పదో తరగతి పరీక్షలు ఏకాగ్రతతో కష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధించాలని విద్యార్థులకు సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించడంలో జాగ్రత్తలు పాటించాలని ఉపాధ్యాయులకు సూచించారు. రానున్న టెన్త్ బోర్డు ఎగ్జామ్ లో వంద శాతం రిజల్ట్ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ  తనిఖీల్లో పరకాల ఆర్డీవో నారాయణ, ఆత్మకూర్ ఎమ్మార్వో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa