ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గురుకుల పాఠశాలలో.. కొత్త డైట్ మెనూ ప్రకారం భోజన వసతి అందించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 16, 2025, 07:53 PM

గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యాల విషయం లో ఎటువంటి రాజి పడకుండా కొత్త డైట్ మెనూ ప్రకారం భోజన వసతి అందించాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి తెలిపారు. శనివారం గజ్వెల్ ప్రజ్ఞపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాతూరు లోగల మహత్మ జ్యోతి భాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించారు. ఈ గురుకులం లో 484 మంది బాలికలు విద్యను అభ్యశిస్తున్నట్లు, గురుకులానికి కావలసిన సౌకర్యాల గూర్చి అడగ్గా ఇడ్లి పాత్రలు, కొన్ని బాగోన్లు కావాలని, డార్మెటరీ లో విండోస్ డోర్స్ రిపేర్ ఉన్నాయని సిబ్బంది కలెక్టర్ కి తెలిపారు. అన్ని సౌకర్యాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
డార్మెటరీ గది, వంటగది, స్టోర్ రూమ్ లను పరిశీలించారు. వంట చేసే సిబ్బందితో మాట్లాడారు. కొత్త డైట్ మెనూ అయితే తప్పనిసరిగా పాటించాలని సామాగ్రి దొరకలేదని సాకులు చెప్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. స్టోర్ రూమ్ లో కాలం చెల్లిన వస్తువులు వాడకూడదనీ సూచించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ బై పి సి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ప్రతి సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండాలని ఇష్టంతో చదవాలని తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్ తరచూ మాట్లాడుతుంటే వస్తాయని, అతి త్వరలో బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నందున బాగా ప్రిపేర్, రివిషన్ చెయ్యాలని సమయం వృధా చెయ్యవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ తహసీల్దార్, ఎంపిడివో గురుకుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa