ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎర్రారంలో చోరీ.. 28 తులాల బంగారం, లక్షన్నర నగదు అపహరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 16, 2025, 07:58 PM

అందోలు మండలం  ఎర్రారం గ్రామములో శేషారెడ్డి అనే రైతు ఇంట్లో గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి దొంగ తనానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు బాధితుడి కథనం ప్రకారం  ఈ విధంగా ఉన్నాయి. ఈ నెల 7వ తేదీ శుక్రవారం పఠాన్ చెరు సమీపంలోని ఇండ్రేశం వద్ద గల కళాశాలలో చదువుతున్న తన కూతురు ఆరోగ్యం బాగాలేదని ఫోన్ రావడంతో ఇంటికి తాళం వేసి ఇంట్లోని వారంతా వెళ్ళి పోయారు. ఆసుపత్రిలో చికిత్సలు చేయించి, బంధువుల ఫంక్షన్ కు వెళ్లి 14 వ తేదీ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు గ్రామంలోని ఇంటికి వెళ్లి చూడగా గేట్ కు వేసిన తాళం వేసినట్లే ఉండగా డోర్ పెట్టి ఉన్నా తాళం లేక పోవడంతో ఇంట్లోకి వెళ్లి బీరువా చూడగా అందులోని వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉండడంతో బాధితుడితో పాటు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
బీరువా తాళాలు పక్కనే పెట్టి పోవడంతో దొంగలు బీరువా తరచి అందులోని 25 తులాల బంగారం రూ.1.60 లక్షల నగదు, 16 తులాల వెండిని గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. వెంటనే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లు ప్రవీణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి లకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసులు క్లూస్ టీమ్ కు చెప్పడంతో వారు సంఘటన స్థలానికి వచ్చి వేలి ముద్రలు సేకరించారు.   సంఘటన స్థలాన్ని సిఐ అనిల్ కుమార్, ఎస్ ఎస్ఐ పాండు సందర్శించారు. బాధితుడు జోగిపేట పోలీసులకు ఇచ్చిన  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa