ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం రేవంత్ ప్రజల్ని మోసం చేసి గెలిచారు: కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2025, 05:20 PM

 సీఎం రేవంత్‌ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కు ఏమీ చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పేర్కొన్నారు. రేవంత్ ప్రజల్ని మోసం చేసి గెలిచారని కేటీఆర్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. 'సీఎం సొంత ఊరు, అత్తగారి ఊరులో ఏమైనా చేశారా? కేసీఆర్ హయాంలో రైతు రాజులా బతికారు.. టకీటకీ అని నిధులు వేస్తానన్న రేవంత్ ఏమీ చేయలేదు' అని అన్నారు.రేవంత్ రెడ్డి నిజాయితీగ‌ల్ల మోస‌గాడు.. ప్ర‌జ‌లు మోస పోవాల‌ని కోరుకుంటారు.. మోస‌గాళ్ల‌ను న‌మ్ముత‌రు.. అందుకే మోసం చేస్తున్నాన‌ని అన్న‌డు. ఇక తెలుగు భాష‌లో ఇన్ని తిట్లు ఉంటాయ‌ను కోలేదు. కొంద‌రు తిట్లను చూస్తే రోషం ఉన్నోడు అయితే పాడుబాడ్డ బావిలో దుంకి చ‌నిపోతేడు. సిగ్గు ల‌జ్జ లేని బ‌తుకు కాబ‌ట్టి బ‌తుకుతుండు రేవంత్ రెడ్డి. ఇన్ని తిట్లు తిన్న సీఎంను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.కుల‌ణ‌గ‌న పేరిట బీసీల‌ను మోసం చేసిండు. 420 రోజుల్లో 430 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. మ‌న పిల్ల‌లు విదేశాల‌కు పోయి ఉన్న‌త చ‌దువులు చదువుకోవాల‌నే ఉద్దేశంతో తెలంగాణ‌లో 1022 గుకులాలు స్థాపించి, ఒక్కో విద్యార్థి మీద‌ ల‌క్షా 20 వేలు ఖ‌ర్చు పెట్టారు. గురుకుల విద్యార్థులంతా ఐఐటీ, నీట్‌, ఐఐఎంలో పాసై పెద్ద చ‌దువులు చ‌దివారు. ఈ స‌న్నాసికి గురుకులాల‌ను న‌డ‌ప‌డానికి వ‌స్త‌లేదు. గురుకులాల్లో 56 మంది పిల్ల‌లు చ‌నిపోయారు. దీన్ని బ‌ట్టి కాంగ్రెస్ పాల‌న ఎంత నికృష్టంగా ఉందో తెలుస్తుంది అని కేటీఆర్ మండిప‌డ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa