ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూలపల్లిలో సబ్ పోస్ట్ఆఫీస్ ఏర్పాటు చేయించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కి వినతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2025, 07:43 PM

పెద్దపల్లి జిల్లాలోని జూలపల్లి మండల కేంద్రంలో సబ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయించి జూలపల్లి మండల ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జూలపల్లి మాజీ ఎంపీటీసీ,బీజేపీ సీనియర్ నాయకుడు అమరగాని ప్రదీప్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం రోజున బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి తో కలిసి ప్రదీప్ కుమార్ వినతిపత్రం అందచేశారు.జూలపల్లి మండలం ఉమ్మడిగా ఉన్నప్పుడు సబ్ పోస్ట్ ఆఫీస్ ఉన్నప్పటికీ ఎలిగేడు మండలంగా ఏర్పడినప్పుడు సబ్ పోస్ట్ ఆఫీస్ ఎలిగేడు మండల కేంద్రంలోనే ఉండిపోగా జూలపల్లికి అన్యాయం జరిగిందని మాకు కూడా పోస్ట్ ఆఫీస్ కావాలని గత పదిహేనేళ్ళుగా పోరాడుతున్నామని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ జూలపల్లిలో సబ్ పోస్టాఫీస్ ఏర్పాటు చేయాలనీ తాను గతంలోనే స్థానిక మాజీ ఎంపీటీసీ మమతా ప్రదీప్ విజ్ఞప్తి మేరకు కేంద్ర సమాచార&కమ్యూనికేషన్ల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తు చేశారని, ప్రస్తుతం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జూలపల్లిలో సబ్ పోస్ట్ఆఫీస్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటానని,తప్పకుండా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారని అమరగాని ప్రదీప్ కుమార్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa