ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండవ విడత దళిత బంధు నిధులు విడుదల చేయకుంటే మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయం ముట్టడిస్తాం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 12:52 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం రెండవ విడత అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇచ్చి నిధులు కేటాయించిందని ఎన్నికల నోటిఫికేషన్ వలన ఆగిపోయిన నల్లగొండ నియోజకవర్గంలోని 1050 మంది దళిత లబ్ధిదారులకు వెంటనే నిధులు విడుదల చేయాలని దళిత బంధు సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కోకిల మహేష్ రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఈరోజు నల్లగొండ అంబేద్కర్ భవనంలో దళిత బంధు సాధన కమిటీ ఉమ్మడి జిల్లా బాధితుల సమావేశం బడుపుల శంకర్ అధ్యక్షతన జరిగింది.  ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ దళిత బంధు నిధులు విడుదలై నేటికీ దళిత లబ్ధిదారులకు అందించకపోవడం అన్యాయమని అన్నారు.  రాష్ట్రంలో హుజూరాబాద్ మధిర నియోజకవర్గాలలో రెండవ విడత దళిత బంధు అమలు చేసి నల్లగొండ జిల్లాలో అమలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినా దళితుల రాతలు మారలేదని దళితుల పేర మంజూరైన నిధులను వెంటనే విడుదల  చేయాలని కోరారు.  లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులతో పెద్ద ఎత్తున పోరాడుతామని తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో మంత్రులకు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు.  అయినప్పటికీ స్పందించకపోవడం అన్యాయమని అన్నారు. 
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకారంగా అంబేద్కర్ అభయ హస్తం పేరా 12 లక్షల రూపాయల పథకం ఏమైందని ప్రశ్నించారు. దళితుల కోసం ప్రకటించిన పథకాల అమలు చేయుటకు చిత్తశుద్ధి లేకపోవడం అన్యాయమని అన్నారు. నల్లగొండ ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక జరిగి ప్రొసీడింగ్స్ ఇచ్చి బ్యాంకులో అకౌంట్ లు ఓపెన్ చేసి కలెక్టర్ అకౌంట్లో నిధులు జమ చేసిన వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నల్లగొండ నియోజక వర్గం శాలిగౌరారం సూర్యాపేట తుంగతుర్తి నకిరేకల్లు నియోజకవర్గాలలో మంజూరైన నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తెలియజేశారు.  అవసరమైతే హైకోర్టులు మెట్లు ఎక్కనున్నట్లు తెలిపారు. నిరుపేద దళితులకు ఆశజూపి ఎన్నికల్లో లబ్ధి పొంది నేడు దళితుల పథకాలు అమలు చేయకపోవడం అన్యాయం అన్నారు.  దళితులంతా ఏకమై తగిన సమయంలో పాలకులకు బుద్ధి చెబుతారని తెలియాశారు. దళిత బంద్ సాధన కొరకు దఫ దఫాలుగా ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు.   ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన కమిటీ నాయకులు అంబేద్కర్ భవన  కన్వీనర్ బొర్ర సుధాకర్ దళిత బందు సాధన కమిటీ నాయకులు కందుల లక్ష్మయ్య, అవుట రవీందర్ నాయకులు ఖతర్నాక్, ఆదిమల్ల లింగయ్య, అవుట రవీందర్, పేర్ల అశోక్, పెరిక యాదయ్య, ఈర్ల ప్రసాద్, కందుల రమేష్, కొప్పోలు విమలమ్మ, దర్శనం రాంబాబు, ఆరె కంటి నరసింహ, పేరపాక నరసింహ,తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa