కోదాడ:ఎవరన్నా స్థలాలు, ఎకరాలు, చెరువులు, కుంటలు ఖబ్జా చేస్తూ ఉంటారు. కానీ ఓ గ్రామంలో వీధులను కూడా వదలకుండా ఖబ్జా చేయడంతో వీధిలో ఉన్న కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేసిన సంఘటన మండల పరిధిలోని గణపవరం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. బాధితులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలో గాంధీనగర్ కాలనీ కి చెందిన పప్పుల పాపమ్మ ఇంటి ముందర వీధి కబ్జాకు గురికావడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
12 అడుగుల బజారు అక్రమణకు గురైందని దీంతో వీధి మొత్తం గేదలు కట్టివేస్తూ నడవకుండా చేస్తున్నారని అడిగితే దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులను ఆశ్రయించిన పట్టించుకోవడంలేదని తక్కువ కులస్తులమని ఆక్రమణకు గురి చేసిన వారు దూషిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొంతమంది తమ ఇంటి వద్ద వరకు వీధిలో ఇనుప కంచే వేశారని తెలిపారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పప్పుల పాపమ్మ, ఏసోబు, తిరపయ్య, పప్పుల కోటయ్య,పిట్టల బాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa