ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయి.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 05:15 PM

శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు  ఎంతగానో దోహదం చేస్తాయని పీఏసీ, ఛైర్మెన్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం జనప్రియనగర్ కాలనీ ఫేజ్ 1, 2 అసోసియేషన్ సభ్యుల అభ్యర్థన మేరకు హఫీజ్ పేట్ యువ నాయకులు నిమ్మల దాత్రీనాథ్ గౌడ్ తన స్వంత నిధులు వెచ్చించి కాలనీలో దాదాపు 32 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా  పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిధిగా  హాజరై సీసీ కెమెరాల ను ప్రారంభించారు. 
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ... యువ నాయకులు ధాత్రినాథ్ గౌడ్ కాలనీ వాసుల అభ్యర్థన మేరకు తన సొంత నిధులతో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయం అన్నారు. సీసీ కెమెరాలు శాంతి భద్రతల పరిరక్షణకు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ప్రతి కాలనీలో సీసీ లు ఏర్పాటు చేసుకోవాలన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మియాపూర్ యస్ ఐ మాణిక్యం, జనప్రియనగర్  ఫేజ్ 1 ప్రెసిడెంట్  జయసూర్య, మల్లికార్జున్, సుధాకర్ దాస్, ఫేజ్ 2 ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జనప్రియ అపార్టుమెంట్స్ ఫేజ్ -1 ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్ తదితరులు  పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa