ముస్తాబాద్ మండలంలో గన్నెవారిపల్లి. నర్సింలతండా. సేవాలాల్ తండా. మామిళ్ళపల్లి గ్రామాల రైతుల పంట పొలాలు వందలాది ఎకరాల సాగు చేసుకున్న పంట పొలాలు ఎండిపోతున్నాయి భూగర్భ జలాలు అడగడంతో వేసుకున్న బోర్లు ఎత్తిపోవడంతో వరి పైర్లకు నీరందక ఎండుతున్నాయి సుమారు 200 ఎకరాల వరి పంట నష్టం వాటిల్లిందని ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
వేయి ఫీట్లు బోరు వేసిన చుక్కనీరు పడలేదని అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే మధ్యలోనే పంట ఎండడంతో కన్నీరు మున్నీరు అవుతున్నరు గత ప్రభుత్వంలో మల్లన్న సాగర్ కాల్వ ద్వారా నక్క వాగులోకి నీరు విడుదల చేశారని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో నక్క వాగులో పుష్కలంగా నీరు ఉండడంతో సాగు చేసుకున్నామని చివరికి భూగర్భ జలాలు అడుగంటడంతో ఎండలు దంచి కొట్టడంతో వేసుకున్న వరి పంట ఎండుతుందని వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పందించి మల్లన్న సాగర్ నుండి నక్క వాగులోకి నీరు విడుదల చేస్తే పంటల పండుతాయని రైతులు కలిసి మల్లన్న సాగర్ ఏఈ డిఈ అధికారులను కలిసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇప్పటికైనా నక్క వాగులోకి నీరు విడుదల చేస్తే కాస్తయినా పంటలు పండుతాయి అని లేకుంటే వేలాది ఎకరాలు ఎండుతాయని ఆ ప్రాంత రైతులు తెలిపారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa