ట్రెండింగ్
Epaper    English    தமிழ்

30 రైళ్లు రద్దు, ఆ ట్రైన్ జర్నీకి సికింద్రాబాద్ వెళ్లకండి.

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 29, 2025, 05:55 PM

రైల్వే ప్రయాణికుల డిమాండ్‌ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొన్ని ప్రత్యేక రైళ్లను జూన్‌ చివరి వారం వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌-రాక్సల్‌, సికింద్రాబాద్‌-రాక్సల్‌, చర్లపల్లి-రాక్సల్‌, సికింద్రాబాద్‌-ధన్‌పూర్‌, చర్లపల్లి-ధన్‌పూర్‌ మధ్య నడిచే రైళ్లు జూన్‌ చివరి వారం వరకు కొనసాగిస్తామని వారు తెలిపారు.


అలాగే.. సోలాపూర్‌-ఎల్‌టీటీ ముంబై, తిరుపతి-సోలాపూర్‌ మధ్య కూడా కొన్ని ప్రత్యేక రైళ్లను ఏప్రిల్‌ చివరి వారం వరకు పొడిగించాలని వారు ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంచుతుందని.. ప్రత్యేకంగా ఈ మార్గాల్లో ప్రయాణిస్తున్న వారికోసం ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అయితే కొన్ని మార్గాల్లో రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్‌-దర్భంగా రైలు (17007-17008) కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 8, 11, 12, 15, 18, 19, 22, 25 తేదీల్లో రద్దు చేయబడతాయని వారు ప్రకటించారు. ఈ రైళ్ల రద్దుకు కారణం.. సౌత్‌ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని కొటార్లియా స్టేషన్‌లో జరుగుతున్న నాన్-ఇంటర్‌లాకింగ్‌ పనులే.


ఇదిలా ఉండగా.. హైదరాబాదు-షాలిమార్‌ ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (18045-18046) రైలు ఇప్పటి వరకు హైదరాబాద్‌ స్టేషన్‌ నుంచి ప్రారంభమైనా.. జూన్ 15 నుంచి చర్లపల్లి టెర్మినల్‌ నుంచి ప్రారంభమవుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఉగాది పండుగ సందర్భంగా.. గుంటూరు-హుబ్లీ మధ్య ప్రత్యేక రైళ్లు కూడా నడుపుతామని అధికారులు వెల్లడించారు. మార్చి 31న గుంటూరు-హుబ్లీ (07271) ప్రత్యేక రైలు, ఏప్రిల్ 1న హుబ్లీ-గుంటూరు (07272) మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వివరించారు.


మే 23వ తేదీ నుంచి 29 వరకు.. సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోని మహబూబాబాద్‌ స్టేషన్‌లో జరుగుతున్న నాన్‌ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా 30 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు రద్దయ్యే సమయంలో.. మరికొన్ని రైళ్ల రాకపోకల వేళల్లో మార్పులు చేశారు.11 రైళ్లను దారి మళ్లించారు. 6 రైళ్లను పాక్షికంగా రద్దు చేయడం.. మరో 4 రైళ్ల వేళలను మార్చడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. 35రైళ్లకు ఆయా తేదీల్లో మహబూబాబాద్‌ స్టేషన్‌లో స్టాపేజీని ఎత్తివేశామని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ వెల్లడించారు.


ఈ చర్యలన్నీ ప్రస్తుతం రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనుల కారణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రైళ్ల వేళల్లో మార్పులు, రద్దుల కారణంగా.. ప్రయాణికులు తమ ప్రయాణాల కోసం ముందస్తు సమాచారం సేకరించడం.. సమయాలను పరిగణనలోకి తీసుకొని రైలు ప్రయాణం చేయడం ఎంతో అవసరమవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa