ట్రెండింగ్
Epaper    English    தமிழ்

100 రోజుల పనికి ఏప్రిల్ 1 నుంచి పెరిగిన వేతనం తీసుకోండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 29, 2025, 05:52 PM

తెలంగాణలో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కనీస వేతనం రూ.300 నుంచి రూ.307కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన వేతనాన్ని ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి రానున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ తెలిపింది.


2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ వేతనం రూ.300 ఉండేది. ప్రతీ సంవత్సరం ఆయా రాష్ట్రాల్లో ఉపాధి హామీ కూలీల వేతనాలను కేంద్రం పెంచుతూ వస్తుంది. ఈసారి తెలంగాణలో కూలీలకు అదనంగా రూ.7 పెంచింది. ఉపాధి హామీ పథకం 2005లో ప్రారంభం కాగా.. అధికారంగా 2006 నుంచి ఆయా రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది. నిరుపేద కుటుంబాల వారికి కనీసం 100 రోజుల పని కల్పిస్తూ.. వారి జీవనోపాధిని మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది. ఉపాధి లేక చాలా మంది పల్లెల నుంచి పట్టణాలకు వలస వెళ్లేవారు. ఈ పథకం అమల్లోకి రాగా.. వలసలు తగ్గినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.


కూలీలకు రోజుకు రూ.600 చెల్లించాలి..


ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలనే డిమాండ్ మొదటి నుంచి ఉంది. ఇటీవల అఖిలభారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.307 ఇవ్వడం వల్ల సగటు కూలీ పెరుగుతున్నా నిత్యావసర రేట్ల పెరుగుదల కారణంగా బతకలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నాడు.


కొలతలు లేకుండా వేతనాలు..


వీటితో పాటే.. ఉపాధి హామీ పథకం పనిని రెండు వందల రోజులకు పొడిగించాలని.. కూలీలకు కొలతలు లేకుండా వేతనాలు చెల్లించాలని ఆయన కోరారు. ఉపాధి హామీ పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని.. టెంట్లు, మెడికల్ కిట్లు వంటివి ఏర్పాటు చేసి.. ఎండాకాలంలో వేడి కారణంగా కూలీలకు మంచినీటి సదుపాయం కల్పించాలన్నారు. పని ప్రదేశాల్లోనే మజ్జిగ ప్యాకెట్లను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa