ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికారంలోకి రాగానే ఆ 400 ఎకరాలు తిరిగి తీసుకుంటాం: కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 03, 2025, 12:54 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పేరుకే ప్రజాపాలన అని, ఎక్కడా ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపించడం లేదని అన్నారు. అప్పుడు హైదరాబాద్ కు గ్రీన్ సిటీ అవార్డు వచ్చిందని, కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవానికి తెరలేపామని గుర్తు చేశారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HUC) సమీపంలోని 400 ఎకరాల భూమి విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ భూమిని ఎవరు కొన్నా, మూడేళ్లలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి స్వాధీనం చేసుకుంటామని, దాన్ని రాష్ట్రంలోనే అతిపెద్ద ఈకో పార్క్‌గా మారుస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, "ఈ 400 ఎకరాల భూమి హైదరాబాద్‌కు ఊపిరితిత్తుల లాంటిది. దీన్ని రక్షించాల్సిన ప్రభుత్వం, విద్యార్థులు పచ్చని చెట్ల కోసం నిరసనలు చేస్తుంటే, వారిని 'గుంట నక్కలు', 'పెయిడ్ ఆర్టిస్టులు' అని అవమానిస్తోంది. ఇది ప్రజాస్వామ్యమా?" అని ప్రశ్నించారు. ఈ భూమిని ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థులు, పర్యావరణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణ హైకోర్టు ఈ విషయంలో ఏప్రిల్ 3 వరకు భూమి క్లియరెన్స్‌ను నిలిపివేయాలని ఆదేశించింది, ఇది కేటీఆర్ వాదనకు మరింత బలం చేకూర్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa