ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిర్చి రైతులకు గుడ్ న్యూస్.. పెరుగుతున్న ధరలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 03, 2025, 06:55 PM

ఖమ్మం, వరంగల్ వంటి మార్కెట్‌లో మిర్చి ధరలు పెరుగుతున్నాయి. ఖమ్మం మార్కెట్‌లోకి రోజువారీగా 19,000 నుంచి 20,000 క్వింటాళ్ల వరకు మిర్చి వచ్చేస్తోంది. గతనెల వరకు క్వింటాకు ₹11,000-₹12,000 వరకు పలికిన ధరలు.. ప్రస్తుతం గరిష్టంగా ₹13,500 వరకు చేరుకున్నాయి. మోడల్ ధరలు కూడా ₹11,500-₹12,000 మధ్య ఉన్నాయి. వరంగల్ మార్కెట్‌కి రోజుకు 6,000 క్వింటాళ్ల మిర్చి చేరుకుంటోంది. అక్కడ ధరలు ₹12,000- ₹13,000 మధ్య ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa