ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మవారికి పల్లకి సేవ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 12, 2025, 09:08 PM

మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల మన దుర్గా భవాని అమ్మవారి ఆలయంలో శనివారం సాయంత్రం పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు, గ్రామస్తులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు. ఏడుపాయల వన దుర్గ భవాని ఆలయంలో శనివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఏడుపాయల మంజీరానదీ తీరాన వున్న ఆంజనేయస్వామికి సింధూరపూజ, హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, తదితరులు పాల్గొన్నారు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa