ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వడగాల్పులను విపత్తుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 15, 2025, 12:48 PM

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వడగాల్పులను ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. అలాగే, వడదెబ్బతో మరణించిన వ్యక్తి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం ఇవ్వాలని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.విపరీతమైన వేడి, వడగాల్పుల మధ్య బయట ఎండలో లక్షలాది మంది పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే అవుట్ డోర్ కార్మికులను రక్షించడానికి తక్షణ ప్రభుత్వ చర్యను డిమాండ్ చేసింది. వడగాల్పులను వాతావరణ విపత్తుగా ప్రకటించి, ఆర్థికంగా ప్రభావితమైన కార్మికులకు విపత్తు భత్యం అందించాలని డిమాండ్‌ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa