హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో శుక్రవారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రాకేశ్, రవళి దంపతుల 11 నెలల కుమారుడు ఆర్యన్ నీటి సంపులో పడి మృతి చెందాడు.
పని నిమిత్తం రాకేశ్ బయటకు వెళ్లగా, తల్లి రవళి ఇంటి పనిలో మునిగిపోయింది. ఈ సమయంలో ఆడుకుంటున్న ఆర్యన్ ఇంటి సమీపంలోని నీటి సంపులో పడిపోయాడు. ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa