ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదనపు కట్నం కోసం వేధింపులు.. ఐదుగురిపై కేసు నమోదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 12:57 PM

జమ్మికుంట మండలం పాపక్కపల్లికి చెందిన గాజవేని రవళి (27)ని అదనపు కట్నం కోసం వేధించిన ఐదుగురిపై కేసు నమోదైంది. ఈ విషయాన్ని సీఐ రవి బుధవారం వెల్లడించారు. రవళికి ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన ఉమ్మనవేణి మహేష్ (30)తో 2024లో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ. 5 లక్షల నగదు, 9 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. 
వివాహం తర్వాత రెండు నెలలు సజావుగా సాగినా, ఆ తర్వాత మహేష్ తన అత్తమామలు, ఆడపడుచుతో కలిసి రూ. 10 లక్షల అదనపు కట్నం కావాలని రవళిని వేధించారని సీఐ తెలిపారు. దీంతో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa