ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పూర్తి మౌలిక వసతులు కల్పించాలి.. కలెక్టర్ అభిలాష అభినవ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 04:53 PM

జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమగ్ర మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం కుంటాల మండలంలోని అందపూర్ గ్రామంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండుటెండలలో పని చేస్తున్న కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా టెంట్లు, తాగు నీటి వసతి, ఆరోగ్య కిట్లు తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ తనిఖీకి అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ కోమల్ రెడ్డి లు కూడా హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa