ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజన్న ఆలయ అభివృద్ధిలో వేగం.. భక్తులకు శీఘ్ర దర్శనం కోసం విస్తరణ పనులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 12, 2025, 04:25 PM

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పథకాలు వేగంగా కొనసాగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సోమవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, భక్తులు ఆలయంలో వేచి ఉండే సమయం తగ్గించే ఉద్దేశ్యంతో ఆలయ విస్తరణ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు.
మునుపటి ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి హామీ ఇచ్చినా, అమలులో మాత్రం విఫలమైందని విమర్శించారు. ప్రస్తుతం ఏ మాత్రం అడ్డంకులు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని, దీనివల్ల భక్తులకు మరింత సౌకర్యంగా, త్వరితంగా రాజన్న దర్శనం లభించే అవకాశం ఉందన్నారు.
అలాగే ఆలయ పరిసర ప్రాంతాల్లో రోడ్డు వెడల్పు పనులకు సంబంధించిన పరిహారంగా రూ. 47 కోట్లు ఇప్పటికే మంజూరై, జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ అయినట్లు తెలిపారు. ఈ నిధుల ద్వారా అవసరమైన భూసేకరణ చేపట్టే అవకాశం ఉందని వెల్లడించారు. రాజన్న ఆలయాన్ని అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa