భారీ లాభాలతో దూసుకెళ్లిన మర్నాడే భారత స్టాక్ మార్కెట్ అదే స్థాయిలో పతనమైంది. మంగళవారం ఇంట్రాడేలో సెన్సెక్స్ 1291 పాయింట్లు క్షీణించి 81,138.78 వద్ద, 349 పాయింట్లు క్షీణించి నిఫ్టీ 24,576 వద్ద ముగిసాయి. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందాలు భారత స్టాక్ మార్కెట్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు.ఉక్కు, అల్యూమినియంపై అమెరికా సుంకాల విషయంలో అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించాలనే ప్రతిపాదనతో భారత్ ప్రపంచ వాణిజ్య మండలి (WTO)ను ఆశ్రయించింది. అమెరికా, భారత్ మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ వాణిజ్య యుద్ధ ఆందోళనలు మాత్రం వెనక్కి తగ్గడం లేదన్న ఆందోళనలు మార్కెట్లో కొనసాగుతున్నాయి.భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత భారత స్టాక్ మార్కెట్ బెంచ్మార్క్లు గత సెషన్లో దాదాపు 4 శాతం పెరిగాయి. దాంతో రిటైల్ ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గుచూపారు. ‘‘నిఫ్టీలో 916 పాయింట్ల పెరుగుదలకు సంస్థాగత కార్యకలాపాలు కారణం కాదని అర్థం చేసుకోవాలి. నిన్న ఎఫ్ఐఐ, డీఐఐ సంయుక్త కొనుగోళ్లు రూ.2,694 కోట్లు మాత్రమే. అంటే షార్ట్ కవరింగ్, హెచ్ఎన్ఐ ప్లస్ రిటైల్ కొనుగోళ్లతో మార్కెట్ ఊపందుకుంది. దీంతో రానున్న రోజుల్లో సంస్థాగత కార్యకలాపాలు మందగించే అవకాశం ఉంది. ఇది ర్యాలీ కొనసాగింపునకు ఆటంకం కలిగిస్తుంది’’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa