ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు పట్టుబడ్డారు.
ఈ కేసులను 2వ జెఎఫ్సియం కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి ఆర్. శశిధర్ విచారించారు. విచారణలో ఒకరికి ఐదు రోజుల జైలు శిక్ష విధించగా, మరొకరికి రూ. 2000 జరిమానా విధించారు. మిగతా ఇద్దరికి తలసరి రూ. 1000 చొప్పున జరిమానాలు విధించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, ట్రాఫిక్ ఎస్ఐ కె. భగవంత్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను గౌరవించి, బాధ్యతతో వాహనాలు నడపాలి. అలా చేయకపోతే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతాయి,” అని హెచ్చరించారు. ప్రజలందరూ నిబంధనలు పాటించి తమ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa