ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బలూచిస్థాన్ లో బాంబు పేలుడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 04:10 PM

పాకిస్థాన్ నుంచి విడిపోయి, స్వతంత్ర దేశంగా అవతరించేందుకు పోరాటం చేస్తున్న బలూచిస్థాన్ లో బాంబు పేలుడు సంభవించింది. బలూచ్ ప్రావిన్స్ లోని కిల్లా అబ్దుల్లా జిల్లాలోని ఓ మార్కెట్లో బాంబు పేలింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో పలు షాపులు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కిల్లా జిల్లా డిప్యూటీ కమిషనర్ రియాజ్ ఖాన్ తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa