ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 26, 2025, 02:21 PM

పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామానికి చెందిన పూదరి లక్ష్మీ కుటుంబానికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 19,000 విలువైన చెక్కును ఎమ్మెల్యే శనివారం ఉట్నూర్ లోని క్యాంప్ కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “పేద ప్రజలకు ఆపద సమయంలో సీఎం సహాయ నిధి ఒక సంజీవనిలా మారుతోంది. ఆరోగ్య సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో ఈ నిధి ఎంతో ఉపయుక్తంగా మారుతుంది,” అని చెప్పారు.
పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ఈ పథకాలను ప్రతి ఒక్కరి వరకు చేర్చడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa