ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు సుదర్శన్ రెడ్డి రూ.10,000 విరాళం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 30, 2025, 12:37 PM

నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని కామేపల్లిగూడెం గ్రామంలో జూన్ 5న జరగబోయే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తడకమళ్ళ గ్రామానికి చెందిన కుసుమ సుదర్శన్ రెడ్డి రూ.10,000 విరాళం అందజేశారు.
విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆర్థిక సహాయంగా శుక్రవారం ఈ విరాళాన్ని అందజేయడం జరిగింది. కుసుమ సుదర్శన్ రెడ్డి చేసిన సహకారాన్ని ప్రశంసిస్తూ, కామేపల్లిగూడెం గ్రామ అంబేద్కర్ యూత్ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఇతర సభ్యులు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విగ్రహ ఆవిష్కరణ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్థులు ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa