ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్తుల కోసం కేసీఆర్ కుటుంబంలో ఫైట్ జరుగుతోందన్న కోమటిరెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 30, 2025, 08:13 PM

తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబంపై, పార్టీలోని అంతర్గత పరిస్థితులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులైన కేటీఆర్, కవిత, హరీశ్ రావు మధ్య ఆస్తుల పంపకాల విషయంలో తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఈ విభేదాలు బయటపడి వారు విడిపోకుండా ఉండేందుకే వారంతా కలిసి డ్రామా ఆడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.కవిత రాసిన లేఖ, హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో నెలకొన్న తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని స్పష్టం చేస్తున్నాయని కోమటిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతల మధ్య సఖ్యత లేదని, వారి మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా నాశనమైందని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. వారి అసమర్థ పాలన వల్లే రీజినల్ రింగ్ రోడ్డు వంటి కీలకమైన ప్రాజెక్టులు కూడా ఆగిపోయాయని విమర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయారని, ప్రజలు ఆ పార్టీని పూర్తిగా మర్చిపోయారని ఆయన ఎద్దేవా చేశారు.గత పాలకుల వల్ల రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను, మహాలక్ష్మి వంటి సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదల చేయడంలో అడ్డుపడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కిషన్ రెడ్డి సహకరించడం లేదని ఆయన విమర్శించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa