ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజీవ్ యువ వికాసం పథకం కింద.. తొలి విడతలో ఎంత మంది లబ్ధిదారులంటే..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 31, 2025, 04:31 PM

రాజీవ్ యువవికాసం పథకంపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, జూన్ 2న యువ వికాసం లబ్ధిదారులకు లోన్లు అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ ముగిసిందన్నారు. తొలి విడతలో భాగంగా జూన్ 2న లక్ష మందికి లోన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. తొలి విడతా జాబితాలోని లక్ష మందిలో హైదరాబాద్ నుంచి 9,219 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని భట్టి చెప్పుకొచ్చారు. వీరిలో 3,721మంది రూ.50 వేల రుణాలు మంజూరు చేయనున్నారు. మిగతా 5,498 మందికి రూ.లక్ష లోన్లు అందజేస్తారు. వీరందరికి జూన్ 2న డబ్బులు అందజేస్తామని భట్టి తెలిపారు.


రాజీవ్ యువవికాసం పథకం కింద హైదరాబాద్ నగరం నుంచి మొత్తం 1,28,763 దరఖాస్తులు వచ్చాయని భట్టి వెల్లడించారు. వీటి వెరిఫికేషన్ బాధ్యతను బ్యాంకర్లకు అందజేశారు. అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. వారి నుంచి అర్హులను ఎంపిక చేశారు. ఇలా అప్లై చేసుకున్న వారిలో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అప్లై చేసుకున్న వారికి జూన్ 2 నిధులు మంజూరు చేస్తామని భట్టి తెలిపారు. అలానే రూ.2 లక్షల లోపు వారికి జులైలో, రూ.2-రూ.4 లక్షల వరకు ఉన్నవారికి ఆగస్టు, సెప్టెంబర్ నెలలో లోన్లు అందజేయనున్నట్టు చెప్పుకొచ్చారు.


తెలంగాణ ప్రభుత్వం.. 2025లో మార్చి 15న రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూతను అందించేందుకు సుమారు రూ.6వేల కోట్లతో ఈ స్కీమ్‌ను అమలు చేయనుంది. రేవంత్ సర్కార్ ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది పైగా దీనికి అప్లై చేసుకున్నారు.


వీరిలో అర్హులైన వారిలో నుంచి.. జూన్ 2 తొలి విడత లక్ష మందికి రూ.50 వేలు, రూ.లక్షలోపు యూనిట్ల ప్రాసీడింగ్‌ మంజూరు చేయనున్నారు. జూన్ 9 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత లబ్దిదారులకు జూన్ 10-15 వరకు ట్రైనింగ్ ఇస్తారు. అనంతరం జూన్ 16 నుంచి యూనిట్ల ప్రారంభత్సవాలు ఉంటాయన్నారు అధికారులు.


జులైలో రూ.లక్ష-రూ.2 లక్షల వరకు, ఆగస్టులో రూ.2-రూ4 లక్షల యూనిట్లకు నిధులు విడుదల చేస్తారని తెలుస్తోంది. రాజీవ్ యువ వికాసం పథకానికి 18 నుంచి 35 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత వాటిని వెరిఫై చేసి.. లబ్దిదారులను ఎంపిక చేశారు. జూన్ 2న తొలి విడతలో భాగంగా రూ.లక్ష వరకు మంజూరు చేయనున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa