రాష్ట్రంలోని పెన్షన్దారులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతోంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి.. తాము అధికారంలోకి వస్తే.. ఆసరా పెన్షన్ మొత్తాన్ని పెంచుతానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. దీన్ని చేయూత పథకంగా అమలు చేసింది. అయితే ఏడాదిన్నరకు పైగానే అవుతున్నా. ఇప్పటి వరకు సర్కార్.. పెన్షన్ మొత్తం పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే మరికొన్ని రోజుల్లోనే దీన్నిపెంచి.. పెన్షన్దారులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోందని సమాచారం.
ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చింది. అప్పటి వరకు ఉన్న 2వేల రూపాయల పెన్షన్ని రూ.4వేలకి.. అలానే దివ్యాంగులకు ఇచ్చే 4 వేల రూపాయల పెన్షన్ మొత్తాన్ని రూ.6 వేలకు పెంచుతానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే దీన్ని అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరికొద్ది రోజుల్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో ఈ ఎన్నికల నిర్వహణ కన్నా ముందే ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్నిపెంచాలని రేవంత్ సర్కార్ భావిస్తోందట. పెన్షన్ మొత్తాన్నిపెంచిన తర్వాత ఎన్నికలు వెళ్తే.. ప్రజల్లో తమ పార్టీ పట్ల నమ్మకం కలుగుతుందని భావిస్తోందట.
ఇప్పటికే రేవంత్ సర్కార్ ఎన్నికల హామీ మేరకు రేషన్కార్టుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేపట్టిన సంగతి తెలిసిందే. అలానే వచ్చే నెలనాటికి పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు రెడీ అవుతోన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్లు మంజూరు చేసింది. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, కొందరు చేతి వృత్తుల వారికి కూడా పెన్షన్లు ఇచ్చేంది. అయితే 2023 ఎన్నికల్లో గెలిచి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ పథకంపేరు మార్చి అమలు చేస్తోంది. ప్రస్తుతం రేవంత్ సర్కార్.. చేయూత పేరుతో పెన్షన్లు ఇస్తోంది.
2025 తాజా లెక్కల ప్రకారం చూసుకుంటే.. తెలంగాణలో పెన్షన్ పథకం కింద.. వేర్వేరు విభాగాలకు చెందిన సుమారు 42.7 లక్షల మంది లబ్ధిదారులు ప్రతీ నెల పెన్షన్ తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులు, చేతి వృత్తుల్లో ఉన్నవారికి ప్రతీ నెల ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తోంది. వృద్ధులతో పాటు ఇతరులకు నెలకు రూ.2,016, వికలాంగులకు నెలకు రూ.4,016 చొప్పున పెన్షన్ అందిస్తున్నారు. ఈమొత్తాన్ని రేవంత్ సర్కార్ పెంచేందుకు రెడీ అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa